కరోనా నుంచి కోలుకున్న భారతీయులు!

ఖాట్మాండు: నేపాల్‌లో కరోనా సోకిన ఆరుగురు భారతీయులు బుధవారం డిశార్జ్‌ అయ్యారు. బిరాత్‌నగర్‌లోని కోశి హస్పటల్‌లో ఐసోలేషన్‌ వార్డులో వీరిని ఉంచి చికిత్స అందించారు. వారిని చాలా సార్లు పరీక్షించి, పరిశీలించిన తరువాత నెగిటివ్‌ అని తేలడంతో హాస్పటల్‌ నుంచి డిశార్జ్‌ చేసినట్లు కోశి హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ సంగీత మిశ్రా తెలిపారు. రెండు సార్లు వారికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని, 19 రోజుల పాటు ఆసుప్రతిలో ఉంచి పూర్తిగా కోలుకున్న తరువాతే డిశార్జ్‌ చేశామని తెలిపారు. (ఇటలీ : రోనా వ్యాక్సిన్ నిపెట్టేశాం!)